ములుగు జిల్లా, అఖండ భూమి ప్రతినిధి ,మే 25 వెబ్ న్యూస్ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో ప్రధమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన ఉద్యమ కారుడు ముంజల బిక్షపతి ముద్దుబిడ్డ ముంజాల సాయిశ్రీని ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారి తస్లీమా మమ్మద్ గురువారం బిక్షపతి నివాసంలో ఘనంగా సన్మానించినారు. అనంతరం సబ్ రిజిస్టర్ తస్లీమా మమ్మద్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలు వారి కన్న కలలు నిజం చేయవలసిన బాధ్యత పిల్లలపై ఉన్నదని ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తస్లిమ మమ్మద్ అన్నారు. ప్రణాళికతో పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. ఉన్నత స్థాయికి రావడానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని పట్టుదలతో ఏదైనా సాధించవచ్చుననీ, ఏకగ్రతతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సబ్ రిజిస్టర్ తస్లీమా మమ్మద్ తెలిపారు. ఒక ఉద్యమకారుని బిడ్డను సన్మానించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. జూన్ 2 నుండి జరిగే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఉద్యమకారుడైన ముంజల బిక్షపతి గౌడ్ ను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని అన్నారు.