పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాహశీల్దార్.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాహశీల్దార్.

 

ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గల పోలింగ్ కేంద్రాలను గురువారం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్,తాహశీల్దార్ ఐపీ శెట్టి పరిశీలించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇవ్వడంతో మండలంలో గల 62 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.మార్పులు చేర్పులను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తాహశీల్దార్ తెలిపారు.తాహశీల్దార్ వెంట ఆయా గ్రామాల విఆర్వోలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!