రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

కొయ్యూరు అఖండ భూమిమే 29 అల్లూరు వెబ్ న్యూస్ :

నర్సీపట్నం నుండి ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి వెళుతున్న టాటా మ్యాజిక్ పాసింజర్ వాహనాన్ని ఒరిస్సా నుండి వస్తున్న బొలోరో పికప్ వాహనం మండలంలోనిడౌనురు పంచాయతీ తురబాల గడ్డ సమీపంలో బలంగా ఢీ కొట్టింది దీంతో ఈ ప్రమాద గంటలలో నర్సీపట్నంకు చెందిన సత్తిబాబు 55 సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ప్యాసింజర్ వాహన డ్రైవర్ కు అదే వాహనంలో ప్రయాణిస్తున్న రామనాపల్లి గ్రామానికి చెందిన మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి అయితే స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన వైద్య సేవలు నిమిత్తం డౌనురు పీహెచ్సీకి తరలించారు ఈ సంఘటన తెలుసుకున్న కొయ్యూరు ఎస్సై రాజారావు తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి పంచినామ నిర్వహించి అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డౌనురు పిహెచ్సి అంబులెన్స్ ద్వారా నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు కాగా ప్రమాదానికి కారణమైన బొలెరో పికప్ వాహన డ్రైవరు పరారు అయ్యాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Akhand Bhoomi News

error: Content is protected !!