శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు సీతక్క, ధర్మారెడ్డి.
ములుగు జిల్లా ,అఖండ భూమి వెబ్ న్యూస్ :
ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి లో సహ్యాద్రి స్టోన్ క్రషర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 48 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహన్ని సోమవారం ములుగు, పరకాల శాసనసభ్యులు ధనసరి అనసూయ సీతక్క, చల్లా ధర్మారెడ్డి లు ఆవిష్కరించారు. అంతకుముందు అమ్వ దేవర నాగరాజు శర్మ వేద పండితులచే గణపతి పూజ,ప్రతిష్ట హావనము, పుష్పాలంకరణ, దాన్యది వ్యాపం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ లు, గోల్కొండ శైలజ సురేష్ మచ్చిక యాదగిరి గౌడ్, ములుగు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్, నాయకులు, గ్రామస్తులు, హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



