బిజెపి విధానాలను ఎండ కట్టండి.. సిపిఐ సీపీఎం

బిజెపి విధానాలను ఎండ కట్టండి.. సిపిఐ సీపీఎం

వెల్దుర్తి, ఏప్రిల్ 27 (అఖండ భూమి) : మండలంలోని నర్సాపురం, సర్ప రాజపురం గ్రామాలలో సిపిఐ. సీపీఎం. ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని గద్దె దించుదాం భారతదేశాన్ని కాపాడుకుందాం అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు నగేష్ వెల్దుర్తి,సిపిఐ మండల కార్యదర్శి టి. కృష్ణ. మాట్లాడుతూ బిజెపి విధానాల వల్ల దేశంలోని ప్రజలు కార్మికులు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్రంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన ప్రశ్నించకుండా మెతుకు వైఖరి అవలంబించడం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం పైన వదిలి తీసుకురావడంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైఫల్యం చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు చిన్నమధులు, సిపిఎం మండల నాయకులు మారెన్న, రామానాయుడు సిఐటియు నాయకులు మద్దయ్య, ఎర్రన్న శీను ఎల్లప్ప వెంటేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!