తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ నేతకు పిలుపు..

 

తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ నేతకు పిలుపు..

విజయవాడ అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్యాలెస్ వేదికగా మరోసారి బుజ్జగుంపుల పర్వం మొదలైంది. ఇప్పటికే అధిష్టానంపై గుర్రుగా ఉండి.. నియోజకవర్గానికే పరిమితమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంవో నుంచి సమాచారం అందింది..

గురువారం మధ్యాహ్నం రావాలని బాలినేనికి పిలుపు వచ్చింది. గత కొంతకాలంగా వైసీపీలో నేతల తిరుగుబాటు అధినేత జగన్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన ఒంగోలు జిల్లా రాజకీయాలు ముఖ్యమంత్రికి నిద్రపట్టనివ్వటంలేదు. ఓ వైపు మామ, మరోవైపు బాబాయిల రాజకీయ వ్యవహారం పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని జగన్ భావిస్తున్నారు. దీనికొక పరిష్కారం కావాలని ఆయన నిర్ణయించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!