కోరమండల్ రైలు ప్రమాదం దురదృష్టకరం…… బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి…..

కోరమండల్ రైలు ప్రమాదం దురదృష్టకరం…… బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి….. పశ్చిమ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్……. విశాఖపట్నం అఖండ భూమి….. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులను తల్లిదండ్రులను పిల్లలను కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని సతగాత్రులకు మంచి వైద్యం అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాధ్యత కుటుంబాలకు అత్యవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా అధికారులను ఉంచడంపై ముఖ్యమంత్రి జగన్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!