క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన ఎం వి వి ప్రసాద్
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :-
జూన్ 4 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జిసిసి చైర్మన్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం వి వి ప్రసాద్ చేతుల మీదుగా ఆదివారం బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎం వివి మాట్లాడుతూ యువకులు ఇలాంటి క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తి చూపించాలని ఆయన అన్నారు ఈ టోర్నమెంట్ లో 18 టీంలు పాల్గొనగా విన్నర్గా శాంతినగర్ పదివేల రూపాయలు రెండవ బహుమతిగా రేవళ్లు ఐదువేల రూపాయలు తో పాటు షీల్డ్ లు కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మి కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు టిడిపి నాయకులు అప్పలరాజు స్వామి అప్పన్న తదితరులు పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



