యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కనకాలపేట పాతబడి వారి వీధిలో త్రాగునీరు కలుషితమైందని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కు వినతి, కనకాలపేట గ్రామంలోని మంచినీటి సరఫరా గురించి క్లుప్తంగా వివరించారు సమస్యను పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని మరియు రోడ్డు వేసి పైన ఎటువంటి గ్రావెల్,చిప్స్ వేయలేదని గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు కొన్ని 100 సంఖ్యలో వృద్ధులు చిన్నపిల్లలు రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది పడుతున్నారని నివాసిత ప్రజలు తెలపగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వెంటనే స్పందించి ఆయన తన సొంత ఖర్చులతో రోడ్డుపైన చిప్స్ కాని లేక గ్రావెల్ వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగినదని,అదేవిధంగా అధికారులతో కలిసి మంచినీటి సమస్యను నేరుగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించడం జరిగినది.