అన్ని సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తుగ్గలి జూన్ 4 అఖండ భూమి వెబ్ న్యూస్ : –
మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కా పక్కిరప్ప ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 18 సచివాలయాలు ఉంటే కేవలం తుగ్గలి ,రామకొండ గ్రామ సచివాలయాల్లో మాత్రమే ఆదర్ కేంద్రాలు ఉన్నాయని, అందువల్ల అన్ని సచివాలయాల్లో ప్రభుత్వం ఆధర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సచివాలయాల్లో ఉద్యోగులు, సంబంధిత కంప్యూటర్లు సిద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఆ సచివాలయాల్లో ఆధార్ నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు.



