ఉపాధ్యాయుల వేకెన్సీలను బ్లాక్ చేయవద్దండి…
పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్.
తుగ్గలి జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ : అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ పోస్టుల వేకెన్సీ లను బ్లాక్ చేయవద్దని కోరుతూ మంగళవారం పి ఆర్ టి యు రాష్ట్ర కమిటీ విద్యాశాఖ కమిషనర్ కు లేఖ రాసినట్లు జిల్లా కార్యదర్శి అంగిడి లోకేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని వేకెన్సీలు గా చూపించాలని కోరుతూ పిఆర్టియు విద్యా కమిషనర్ కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఫోటో రైట్ అప్(06తుగ్గలి04) పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్



