ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ
తుగ్గలి జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండలంలోని బొందిమడుగుల, మారెళ్ళ గ్రామాలలో ఇటీవల అప్పుల బాధ భరించలేక వడ్డే ఆంజనేయులు, రామ్ కొండ హరిజన నర్సింహులు అనే రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతో ఆ రైతుల భార్యలు అగు వడ్డే నాగేశ్వరమ్మ ,హరిజన రాణెమ్మ ల కు మంగళవారము ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఒక్కొక్కరికి రూ 7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ అప్పుల బాధతో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు. అయితే మృతి చెందిన కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ 7 లక్షలు ఆర్థిక సహాయం అందివ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మునిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగన్న, మంకె రాముడు, పందికోన రామాంజనేయులు, గణ మద్దిలేటి, ఎంపీటీసీ మెకానిక్ మునెప్ప తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..