ఎనభై కుటుంబాల దాహం తీర్చిన ఏ.రమణ
తన సొంత నిధులతో మంచి నీరు బోరు ఏర్పాటు
అనకాపల్లి, రోలుగుంట,అఖండ భూమి:
అనకాపల్లి జిల్లా,రోలుగుంట మండలం,బుచ్చింపేట గ్రామ పంచాయతీకి చెందిన బుచ్చంపేట గ్రామంలో చేతి వృత్తులు చేసుకొనే (మేదరి పేట)సుమారుగా 80 కుటుంబాలు మంచి నీటి సమస్య తో గత కొంత కాలంగా బాధపడు తున్నట్లుగా తన దృష్టికి తీసుకురావడం జరిగింది.దీనిలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ తన సేవా కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో బోరును తవ్వి మోటారు,ట్యాంక్ ను ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.
తన సొంత నిధులతో ఈరోజు(ఆదివారం )బోరును కొయ్యించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిత్రులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.తన వయస్సుతో సంబందం లేకుండా రమణ సేవా కార్యక్ర మాలు పట్ల గ్రామ ప్రజలు, మిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు రమణని అభినందించటం,కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”