రేపు నుండి ఉపాధి పనుల గ్రామసభలు… ఏపీఓ రాజు నాయక్

 

రేపు నుండి ఉపాధి పనుల గ్రామసభలు… ఏపీఓ రాజు నాయక్

వెల్దుర్తి జూన్ 13 (అఖండ భూమి) : మండలంలోని 23 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల గ్రామ సభలు జరుగుతున్నట్లు ఏపీవో రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి సోషల్ ఆడిట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు ఉపాధి పనులు ఏ విధంగా జరిగాయి అన్న కోణంలో ఎస్ఆర్పిలు, డిఆర్పీలు విచారణ చేపడతారని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు జరిగిన పనులను వెలికి తీసి చివరి రోజున ఓపెన్ ఫారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సోషల్ ఆడిట్ కార్యక్రమానికి ఎస్ఆర్పిలు ఇద్దరు డిఆర్పిలు పదిమంది దాకా పాల్గొని పనులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!