రేపు నుండి ఉపాధి పనుల గ్రామసభలు… ఏపీఓ రాజు నాయక్
వెల్దుర్తి జూన్ 13 (అఖండ భూమి) : మండలంలోని 23 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల గ్రామ సభలు జరుగుతున్నట్లు ఏపీవో రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి సోషల్ ఆడిట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు ఉపాధి పనులు ఏ విధంగా జరిగాయి అన్న కోణంలో ఎస్ఆర్పిలు, డిఆర్పీలు విచారణ చేపడతారని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు జరిగిన పనులను వెలికి తీసి చివరి రోజున ఓపెన్ ఫారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సోషల్ ఆడిట్ కార్యక్రమానికి ఎస్ఆర్పిలు ఇద్దరు డిఆర్పిలు పదిమంది దాకా పాల్గొని పనులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”