జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కమిటీల నియామకం
కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 28: (అఖండ భూమి) కాకినాడ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వియ్యపు అప్పల స్వామి యాదవ్ అధ్యక్షతన జరిగింది. జగ్గంపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కుండల సాయికుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పంచికట్ల రామకృష్ణ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జగ్గంపేట, ప్రత్తిపాడు, నియోజకవర్గాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీల నియామకం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా చీపురుపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఏఎస్ఎన్ రావు, సెక్రటరీగా వరి రామకృష్ణ . ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులుగా మడ బాల బాబ్జి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వికలాంగుల అధ్యక్షులుగా గింజాల దుర్గాప్రసాద్ యాదవ్ నియమితులయ్యారు. జగ్గంపేట నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం యువత అధ్యక్షులుగా ఉపమాక వీర వెంకటరమణ, గండేపల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పోకల సుబ్బారావు తదితరులు నియమితులయ్యారు.ఈ సందర్భంగా వీరికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కుండల సాయికుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పంచికట్ల రామకృష్ణ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కాకినాడ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం