హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. భూమి విషయంలో ఘర్షణ

 

హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. భూమి విషయంలో ఘర్షణ

 

హైదరాబాద్లోని పాతబస్తీలో శనివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. మీర్చౌక్ ఏరియాలో ఇంటి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య ఘర్షణ జరిగింది..

ఇరు వర్గాలు తొలుత కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మక్సూద్ అనే వ్యక్తి ఎయిర్ గన్తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో మీర్ చౌక్ ఏరియాలో భయాందోళనతో ప్రజలు వణికిపోయారు..

Akhand Bhoomi News

error: Content is protected !!