• ఆశా కార్యకర్తలకు వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం – కంఠారం పిహెచ్సి డాక్టర్  మజీదా బేగం

 

అల్లూరి జిల్లా,కొయ్యూరు,అఖండ భూమి, వెబ్ న్యూస్ :

మండలంలోని కంటారం పీహెచ్సీ పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలతో వివిధ వ్యాధులు పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని పీహెచ్సీ వైద్యాధికారి మజీదా బేగం మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలకు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి చర్మవ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు పంటికి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలియజేశారు, వచ్చే ది వర్షాకాలం అయినందున ప్రజలకు విషయాలు పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయని ఆమె అన్నారు,అదేవిధంగా ఇంటి ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా సూచనలు చేయాలని ఆశ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో రమణ, హెచ్ వి,తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!