రిటైర్డ్ డీఎస్పీ శివశంకర్ రెడ్డి కన్నుమూత..

రిటైర్డ్ డీఎస్పీ శివశంకర్ రెడ్డి కన్నుమూత

 

నేడు హైదరాబాద్ లో అంత్యక్రియలు

కర్నూలు ఏప్రిల్ 28(అఖండ భూమి) : కర్నూలు నగరంలోనీ ఎస్ఐ నుండి డీఎస్పీ వరకు విధులు నిర్వహించిన శివశంకర్ రెడ్డి హైదరాబాద్ అప్పోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. శివశంకర్ రెడ్డి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం, రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి 203 అవార్డులు, రివార్డులు, సేవాపథకాలు అందుకున్నారు. ఈ నెల 29 తేదీన ఉదయం వైకుంఠ మహాప్రస్థానం జూబ్లీహిల్స్ హైదరాబాద్ నందు పార్థీవ దేహం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శుక్రవారం పార్థివ దేహం మహాప్రస్థానం జూబ్లీహిల్స్ లోబంధుమిత్రులు స్నేహితులు అభిమానుల సందర్శనార్థం కోసం ఉంచుతారు. శివశంకర్ రెడ్డి మృతికి చిత్తూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి, కర్నూలు 3వ పట్టణ ఎస్ఐ విశ్వనాథ రెడ్డి, బందువులు, మిత్రులు సంతాపం తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!