అమ్మవారికి 1.4 కేజీల వెండి బహుకరణ….
శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం లో వెలసిన శ్రీ మహా లక్ష్మీదేవి అమ్మవారికి నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణానికి చెందిన గోర్ల చంద్రశేఖర్ తండ్రి గొర్ల సుబ్బరాయుడు కుటుంబం శ్రీ మహా లక్ష్మీ దేవి అమ్మవారికి 1.4 కేజీల వెండి పాదాలను మరియు నెక్లెస్ ను అందజేశారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ ఓ పాండురంగారెడ్డి మరియు చైర్మన్లు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.