రాజకీయాలు వేరు ప్రజా… సంబంధాలు వేరు…గోపాల్ రెడ్డిని పరామర్శించిన శశిధర్ రెడ్డి..
అఖండభూమి. సూర్యాపేట జిల్లా. కోదాద్రూరల్ :
రాజకీయాలలో అంకితభావంతో పనిచేస్తూ, సోదర భావంతో మెలగాలని, రాజకీయాలను, ప్రజా సంబంధాలను ఒక తాటిపై కట్టరాదని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం శాంతినగర్ గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ సీనియర్ నాయకుడు గునుకుల గోపాల్ రెడ్డి కి హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసి, భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి పరామర్శించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలు, ప్రజా సంబంధాలు వేరువేరు అని ఈ రెండిటిని కలిపి చూడకూడదని అన్నారు. నాటినుండి నేటి వరకు రాజకీయాల్లో నమ్ముకున్న పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ, తోటి రాజకీయ నాయకులతో సోదర భావంతో ఉండడమే నిజమైన రాజకీయు నాయకుని లక్షణమని అన్నారు. పరామర్శించిన వారిలో అనంతగిరి జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరు జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు శాంతినగర్ గ్రామ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు కాకమారి నారాయణరెడ్డి కొత్త వెంకటరెడ్డి మారగాని వెంకన్న కర్త రమేష్ అనంతగిరి పిఎసిఎస్ డైరెక్టర్ హర్షదాసు వార్డ్ మెంబర్ కరుషరాజు కరిష పిచ్చయ్య తదితరులు ఉన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…



