పునరావాస కేంద్రంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

 

 

పునరావాస కేంద్రంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

మానవత్వం చాటుకున్న నర్సింగ్ విద్యార్థినులు.

ఏటూరునాగారం, ఆగస్టు 04 ,అఖండ భూమి ప్రతినిధి :

ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ గిరిజన భవన్ పునరావాస కేంద్రంలో గల కొండాయి, మాల్యాల, దొడ్ల గ్రామాల వరద బాధితులకు శుక్రవారం జాన్ నర్సింగ్ కాలేజి, మైత్రి స్కూల్ ల చైర్మన్ పంజాల శంకరయ్య, ప్రిన్సిపాల్ లు శమీమ్, కవిత, సుజాత ల చేతుల మీదుగా 500 కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎఎస్పీ దూరిశెట్టి. సంకీర్త్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.యాజమాన్యం, ఎఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో సీ ఐ మండల.రాజు,ఎసై కృష్ణ ప్రసాద్, పెండ్యాల. ప్రభాకర్, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!