నేడు అవిశ్వాసంపై ఓటింగ్
ప్రధాని మోడీ హాజరయ్యేనా?
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు (గురువారం) ఓటింగ్ జరగనుంది.
పార్లమెంట్ కు రాకుండా ఉన్న ప్రధాని మోడీని సభకు రప్పించి, మాట్లాడించడా నికి ఒక సాధనమే ఈ అవిశ్వాస తీర్మానమని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. అది నేడు నెరవేరనుంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ నేడు సమాధానం ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్లో నేడు అవిశ్వాసంపై ఓటింగ్..ఎలాగూ ప్రభుత్వమే గెలుస్తుందని అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత లోక్ సభ అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వానికి మద్దతుగా 369, ప్రతిపక్షానికి మద్దతుగా 154, తటస్థంగా 16 మంది మద్దతు ఉంది.