నాతవరం మండలం గొలుగొండపేట లో నా భూమి నా దేశం కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక అమరవీరుల పేర్లు గల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకట రమణ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి పెంపొందించాలని యువతలో దేశభక్తి పెరగాలని స్వాతంత్ర్యోద్యమ అమర వీరులకు వందనం సమర్పించారు అమరవీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు ప్రతీ భారతీయునిలో అమర వీరుల స్ఫూర్తిని నింపడం ఎంతైనా అవసరం ఉందని ఆయన అన్నారు అనంతరం అమరవీరుల సంస్మరణకు చిహ్నంగా మొక్కలను నాటి పంచప్రాణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, ఎంపీటీసీ సత్యనారాయణ ,సెక్రటరీ రాజబాబు, ఏపీవో చిన్నారావు, గ్రామ ప్రజలు, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


