60 లక్షలు తో రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిన ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ
కొయ్యూరు అఖండ భూమి ఆగస్టు 13 అల్లూరు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో
వైన్ పాకలు మెయిన్ రోడ్డు నుండి క్వారీ జంక్షన్ వరకు 60 లక్షల రూపాయలతో 1.6 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కొబ్బరి కాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ రహదారి మరమ్మత్తులకు గురై ఉన్నందున పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కి తెలియజేయడంతో.. ఎమ్మెల్యే,ఎంపీ చొరవతో బీటి రోడ్డు నిధులు మంజూరు చేయించి నిర్మాణం వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఎమ్మెల్యే, ఎంపీ కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ వైస్ సర్పంచ్ భవాని,వార్డు మెంబర్ రాజేశ్వరి,సచివాలయ కన్వీనర్లు నాగేంద్ర,శివ,వీఆర్పి దేవుడురాజు,వైఎన్ పాకలు గ్రామస్తులు మాదల పోతురాజు, బాలరాజు,రమణ,ఈశ్వర్,ఏఇ రామకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ చిన్నా,రావణాపల్లి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”