వెల్దుర్తిలో టిడిపి నాయకుల సంబరాలు..
వెల్దుర్తి అక్టోబర్ 31 (అఖండ భూమి) : వెల్దుర్తి పట్టణం నందు టిడిపి నాయకులు మంగళవారం టిడిపి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…టిడిపి జాతీయ నాయకులు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడం పట్ల టిడిపి నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యం పట్ల నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం జరిగింది. అదే తరుణంలో స్కీవాష్ పిటిషన్ విచారణ జరపాలని తెలిపారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వచ్చినప్పుడే టిడిపి శ్రేణులం ఆనందాన్ని వ్యక్తం చేస్తామని వెల్లడించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు .ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ సీఎం డౌన్ డౌన్, సైకో పోవాలి,,, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు టి బలరాం గౌడ్, వీరభద్రుడు, ఎర్ర బజారు, సుధాకర్ గౌడ్, మల్లెపల్లి మురళీధర్ రెడ్డి, మెకానిక్ నారాయణ, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



