రేపు నాతవరం లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సమావేశం

నాతవరం మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం ఉదయం పది గంటలకు తెలుగు దేశం పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు గా నాతవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్,నియోజక వర్గ, మండల కమిటీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!