అగ్ని ప్రమాద బాధితులకు తన సాయాన్ని అందించిన గుడ్ సీడ్ ఫౌండేషన్..

 

 

అగ్ని ప్రమాద బాధితులకు తన సాయాన్ని అందించిన గుడ్ సీడ్ ఫౌండేషన్..

అమలాపురం అఖండ భూమి: అమలాపురం. ఇటీవల అమలాపురం రూరల్ మండలం నడిపూడిలో జరిగిన అగ్ని ప్రమాదంలో దొండపాటి లోవరాజు తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యి కుటుంబం రోడ్డున పడటంతో విషయం తెలుసుకున్న అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు బాధిత కుటుంబానికి సాయం అందించారు. ఆదివారం గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు అందించారు.

 

ఈకార్యక్రమంలో సర్పంచ్ చెల్లుబోయిన నాని, ఉప సర్పంచ్ కాట్రు వసంత కుమార్, వాసంశెట్టి భానోజీ, ఫౌండేషన్ సభ్యులు గంటా లక్ష్మీప్రసాద్,కుంచే వెంకటేశ్వరరావు మనోజ్ కొంకి, పరమట రాజేష్, కుంచే అర్జున్, దోనిపాటి రాంబాబు, పరమట జాన్, పోలినాటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!