ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియర్రా మస్వామి 50వ వర్ధంతి.
యనం (అఖండ భూమి)భారతీయ సామాజిక కార్యకర్త-రాజకీయ నాయకుడు ఆత్మగౌరవ ఉద్యమం-ద్రవిడర్ కజగంను ప్రారంభించిన మహానుభావుడుద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియర్ రామస్వామి 50వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రాంతీయ పరిపాలన అధికారి మునుస్వామి, ఎ.ఎస్.ఐ.కవల వెంకట రమణమూర్తి
తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ.ఎస్.ఐ
కవల వెంకటరమణ మూర్తి మాట్లాడుతూ పెరియర్ రామస్వామి ని
ఈరోడ్ వెంకటప్ప రామసామి అని పిలుస్తారని
రామసామి 1919లో భారత జాతీయ కాంగ్రెస్లో 1924 లో ట్రావెన్కోర్లోని వైకోమ్లో మహాత్మా గాంధీ పాల్గొన్న అహింసాత్మక ఆందోళన (సత్యాగ్రహం)లో రామసామి పాల్గొన్నారని
1926లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించారని,1929 నుండి 1932 వరకు రామసామి బ్రిటిష్ మలయా-యూరప్ -సోవియట్ యూనియన్లలో పర్యటించారని
ఆత్మగౌరవ ఉద్యమం- ద్రావిడ ఉద్యమాన్ని ప్రారంభించారని దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలను కలుపుతూ ద్రవిడ నాడు అనే స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించారని ద్రావిడర్ కజగం అనే సామాజిక-సాంస్కృతిక సంస్థ స్థాపకుడని పెరియార్ కాంగ్రెస్ పార్టీకి మరియు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను తెలియజేయడానికి కుడి అరసు అనే వారపత్రికను ప్రారంభించారని పెరియర్ రామస్వామి
25 డిసెంబర్ 1973 లో చనిపోయారని ఈ సందర్భంగా ఎ.ఎస్సై. కవల వెంకటరమణ మూర్తి తెలిపారు.