డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి

అచ్యుతాపురం డిసెంబర్ 24 (అఖండ భూమి ) : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత వారం రోజులుగా సమ్మెబాట పట్టారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిన్న ధర్నా శిబిరం వద్ద మునగపాక మండల విద్యాశాఖ కార్యాలయం చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. దీంతో అతని తోటి ఉద్యోగులు అనకాపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అతనికి వైద్యం నిమిత్తం అత్యధికంగా ఖర్చవుతుందని హాస్పటల్ సిబ్బంది చెప్పారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్ ప్రభుత్వం నుంచి లేకపోవడంతో ఆయన కుటుంబం ఆందోళనలో ఉంది దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ఉద్యోగికి అయ్యే ఖర్చులు అన్నిటిని ప్రభుత్వమే భరించాలని అదేవిధంగా ఆయనకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా ఏపీ సిపిఎస్ ఈఏ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోటూరు త్రినాధ స్వామి తన ప్రకటనలో పేర్కొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


