కశింకోట. జనవరి 21. (అఖండ భూమి)
కశింకోట మండలం లోని సోమవారం గ్రామంలో శ్రీ సీతారాముల సంబరాలు అంగరంగవైభవం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మలసాల భరత్ పాల్గొన్నారు. రామాలయ అభివృద్ది కై 20 వేల రూపాయల విరాళాన్ని గ్రామ ప్రజలకు అందించారు. అంతే కాకుండా ఎల్లప్పుడూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ సహకరిస్తానని గ్రామ ప్రజలకు మాటిచ్చారు.ఈ సందర్భం గా గ్రామ ప్రజలు మలసాని భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతు నాగ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడే నాయకులను గెలిపించుకోవడం మన బాధ్యత అని, సంక్షేమాభివృద్ధి కై మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతీ కార్యకర్త ఒక సైనికునిలా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం ఆదినారాయణ, కరణం కృష్ణ, బాబురావు, సంజీవ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్