నాతవరం టీడీపి లో సమన్వయ లోపం.. మండి పడుతున్న కార్యకర్తలు.

నాతవరం మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచుటలో విఫలమవుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మండలంలోని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ నాయకులు గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలపై నోరు విప్పడం లేదని కార్యకర్తలు వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల ఫలితాల పై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఇకనైనా మండల నాయకత్వం గ్రామ నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ఉత్సాహం గా పార్టీ గెలుపొందే దిశగా కృషి చేయాలని కార్యకర్తలు కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!