నాతవరం. ఫిబ్రవరి 1 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జె.రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లో బాధ్యతలు నిర్వహించి బదిలీపై నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా నియమితు లయ్యారు.ఇప్పటివరకు పనిచేసిన ఎంపిడిఒ ఎన్.హనుమంతరావు కాకినాడ జిల్లా గండేపల్లి కి బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఒ ను పలువురు అధికారులు,నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎ ఒ పార్థసారథి, ఇ ఒ పి అర్ డి నరసింహమూర్తి, మండల విద్యాశాఖ అధికారి టి.అమృత కుమార్, ఎ పి ఒ చిన్నారావు, లగుడు నాగేశ్వరరావు, మైనం నాగ గోపి, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,ఎన్ ఆర్ ఇ జి యస్ సిబ్బంది తదితరులు పాల్గొని ఎంపిడిఓ కి శుభాకాంక్షలు తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం