నాతవరం. ఫిబ్రవరి 1 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జె.రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లో బాధ్యతలు నిర్వహించి బదిలీపై నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా నియమితు లయ్యారు.ఇప్పటివరకు పనిచేసిన ఎంపిడిఒ ఎన్.హనుమంతరావు కాకినాడ జిల్లా గండేపల్లి కి బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఒ ను పలువురు అధికారులు,నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎ ఒ పార్థసారథి, ఇ ఒ పి అర్ డి నరసింహమూర్తి, మండల విద్యాశాఖ అధికారి టి.అమృత కుమార్, ఎ పి ఒ చిన్నారావు, లగుడు నాగేశ్వరరావు, మైనం నాగ గోపి, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,ఎన్ ఆర్ ఇ జి యస్ సిబ్బంది తదితరులు పాల్గొని ఎంపిడిఓ కి శుభాకాంక్షలు తెలిపారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



