గునుపూడి లో పెన్షన్ల నుండి అక్రమంగా వెయ్యి కోత…
పెన్షన్ ల నుండి బలవంతపు వసూళ్లు దారుణం…
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, నాతవరం మండలం గునుపూడి గ్రామంలో వృద్ధులు, వితంతువుల నుంచి వారికి అందే జగనన్న పెన్షన్ల నుంచి అక్రమంగా 1000 రూపాయలు కోత విధిస్తూ వైసీపీ కార్యకర్తలు దందాలకు పాల్పడుతున్నారు. పూట గడవలేని వృద్ధుల నుంచి కూడా 1000 రూపాయలు బలవంతం గా లాగేసు కుంటున్నారు. పూట గడవడం కోసం పెన్షన్ల మీదే ఆధారపడి పస్తులతో జీవిస్తూ కుటుంబాన్ని నడుపుకునే కుటుంబాలను సైతం వదలడం లేదు. పేదల నుంచి దళితుల నుంచి బలవంతంగా దందాలకు పాల్పడుతున్నారు. ఈ వసూళ్లు తప్పని కొంతమంది వారించినా వినకుండా బెదిరిస్తూ పెన్షన్ల నుండి 1000 వసూలు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ వసూళ్లు చేయమన్నారని, మా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లే కదా అంటూ దందా వసూలు చేసే దళారులు సమాధానం ఇస్తున్నారు. బాధిత వృద్దులు,ప్రజాప్రతినిధులు అధికారులు దళారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


