జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి… ఉప సర్పంచ్ కరక అప్పలరాజు
“నేషనల్ ఇమ్యునైజేషన్ డే”ను పురస్కరించుకుని నాతవరంలో రామాలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కరక అప్పలరాజు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలుకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. దీని వలన పిల్లలు అంగ వైకల్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం సత్యవతి, ఆశ వర్కర్ మాడెం రాజు, అంగన్వాడీ వర్కర్ లగుడు వరలక్ష్మి, చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



