కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నగర్ లో డ్రైనేజ్ కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టక పోవడంతో గృహాల నుంచి విడుదలయ్యే నీరు, డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే నిల్వ ఉండి పోతుందని, మట్టి రోడ్లు కావడం తో అవి అధ్వాన్నంగా తయారవుతున్నాయని సోషల్ యాక్టివిస్ట్ కొండ్రు కళ్యాణ్ అన్నారు. ప్రజలు తమ ఇంటికి వెళ్ళే దారిలో మురికి నీరు నిల్వ ఉండడం తో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నీరు నిల్వ ఉండి మురికి నీరు గా మారి దోమల వృద్ధి రేటు పెరిగి అనేక వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయని దీనివలన ప్రజలు మలేరియా, టైఫాయిడ్ లాంటి అనేక వ్యాధులు బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల పై అధికారులు దృష్టి సారించాలని అంతే కాకుండా డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


