ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జన్మదిన వేడుకలు..
వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) :
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి సభ్యులు అహ్మద్ అలీ ఖాన్ 46 వ జన్మదినం సందర్భంగా వెల్దుర్తి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్ర రెడ్డి,కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ మెంబర్ బొందిమడుగుల మహాబూబ్ భాష వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖాదర్ బాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంతరం ప్రముఖ వైద్యులు అలిసాహెబ్ , మెడికల్ ఆఫీసర్ రంగస్యామి మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పాలు బ్రెడ్ బిస్కెట్లు పంచడం చాలా మంచి కార్యక్రమం అని వారు అభిప్రాయపడ్డారు. ఆనంతరం వెల్దుర్తి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖాదర్ భాషా మరియు ముఖ్య నాయకులు షేక్ జాకీర్,దస్తగిరి,చాంద్ భాషా,అల్తాఫ్, చిన్నా మాట్లాడుతూ అహ్మద్ అలీ ఖాన్ కి 46 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కాంగ్రెస్ కమిటీ నాయకులు,108 వాహన చోదకులు మరియు రాజు, ఖాదర్, వలీ, జాకీర్, చిన్నా, దస్తగిరి, అల్తాఫ్, చాంద్ భాషా, నరసింహ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం