ఆ ఇద్దరు బుకీపరులు సస్పెండ్.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు చర్యలు
కర్నూలు బ్యూరో మార్చి 29 (అఖండ భూమి) : ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినందుకు చెరుకులపాడు గ్రామానికి చెందిన ఇద్దరు బుక్కీపరులపై చర్యలు తీసుకొని సస్పెండ్ ఆదేశించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బుధవారం వెల్దుర్తి లో వైఎస్ఆర్సిపి ప్రెస్ మీట్ లో చెరుకులపాడు పంచాయతీకి చెందిన ఇద్దరు బుక్కు కీపర్లు పాల్గొన్నారని చెరుకులపాడు గ్రామానికి చెందిన పార్వతయ్య తహసిల్దార్ అనంతాచారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. సుధాకర్, రంగడు అనే బుక్ కీపర్లు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పాల్గొన్నారు అని తహసిల్దార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా వైకెపి డిఆర్డిఏ ఎన్నికల నియమావళి క్రమశిక్షణలో భాగంగా వీరిద్దరిని విధుల నుండి తొలగించినట్లు తహసిల్దార్ అనంతాచారి తెలిపారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”