కాంగ్రెస్ 9 గ్యారెంటీలు ప్రజా శ్రేయస్సు… షేక్ ఖాదర్ భాషా…

 

 

కాంగ్రెస్ 9 గ్యారెంటీలు ప్రజా శ్రేయస్సు… షేక్ ఖాదర్ భాషా…

 

కర్నూలు ప్రతినిధి ఏప్రిల్ 04 (అఖండ భూమి) : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 9 గ్యారెంటీలు ప్రజా శ్రేయస్సు కొరకు పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్దుర్తి మండల అధ్యక్షులు షేక్ ఖాదర్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా షేక్ ఖాదర్ భాషా మాట్లాడుతూ రైతు పెట్టుబడి మీద 50% మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా 30 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2. 25 లక్షలు ఉద్యోగాలు ఇవ్వబడును. ఉపాధి హామీ కూలికి రోజు కనీసం 400 రూపాయలు వేతనం కల్పించే విధంగా చూడడం. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు 4000 రూపాయలు వికలాంగులకు 6000 రూపాయలు కల్పించినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాల వరకు గ్యారెంటీ, ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు, ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు 9 గ్యారంటీలను అమలుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి ప్రజా శ్రేయస్సును కాపాడండి అని ఆయన తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!