మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్ర ప్రదేశ్ బి.సి సంక్షేమ గురుకుల పాఠశాల లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్. ఎం. సి) ఎన్నికలు గురువారం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ గా పైల శ్రీను, వైస్ చైర్మన్ గా శ్రీమతి కొండ్రు రవణమ్మ ను విద్యార్ధుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి. శ్రీను మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. పాఠశాల వైస్ చైర్మన్ రవణమ్మ మాట్లాడుతూ ఈ పాఠశాల అన్ని ఫలితాలలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని దానికి తగ్గట్టుగా బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. అంతేకాకుండా పాఠశాల సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్నికైన వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్ పి.యజ్ఞ విశ్వ శాంతి, ఉపాధ్యాయులు గణేష్, రంగనాథ్, నజీర్, మూర్తి, రాజశేఖర్, వెంకట్, కృష్ణ మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


