మత్తు పదార్థాలకు బానిసతలు కాకూడదని ఎంఈవో-2 మల్లూ నాయక్, ఏఎస్సై మూర్తి తెలిపారు. మంగళవారం డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి పిచ్చిరావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్దాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని సేవించడం వల్ల అనారోగ్యం పాలవుతారని చెప్పారు. మత్తు పదార్ధాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. అనంతరం మానవహారం చేశారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి అంజనేయులు, సార్ట్స్ బాల ప్రకాశం ఏపిఎం మందా ముఇయబాబు, ఉపాధ్యాయులు షేక్ సాధిక్, బాల ప్రకాశం సిబ్బంది శేసి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


