మత్తు పదార్థాలకు బానిసతలు కాకూడదని ఎంఈవో-2 మల్లూ నాయక్, ఏఎస్సై మూర్తి తెలిపారు. మంగళవారం డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి పిచ్చిరావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్దాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని సేవించడం వల్ల అనారోగ్యం పాలవుతారని చెప్పారు. మత్తు పదార్ధాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. అనంతరం మానవహారం చేశారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి అంజనేయులు, సార్ట్స్ బాల ప్రకాశం ఏపిఎం మందా ముఇయబాబు, ఉపాధ్యాయులు షేక్ సాధిక్, బాల ప్రకాశం సిబ్బంది శేసి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్