అఖండ భూమి-యర్రగొండపాలెం పోస్టాఫీసుకు వచ్చే ప్రజలకు సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలని తపాల ఇన్స్సెక్టర్ పీ మదన్ మోహన్ అన్నారు. మంగళవారం యర్రగొండపాలెంలోని పోస్టాఫీసుకు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా సేవింగ్ ఖాతాలు, తపాల జీవిత భీమా పధకాలు, ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రజలకు అందించాలని తెలిపారు. వాటి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా కొందరు ఆర్టీ పుస్తకాలు లేవని తెలపడంతో వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొయిల్ వర్సెస్ ఐ శంకర్ ప్రసాద్, సబ్ పోస్టు మాస్టర్ కె కొండా నాయక్, పోస్టు మ్యాన్లు కమల్ అహమ్మద్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్