జిల్లాతెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

 

 

జిల్లాతెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

— రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,లాండే భాస్కర్ రావు, ఇందూరి సిద్ధ గౌడ్

— కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు ముద్రకోల నర్సింహులు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు లాండె భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి ఇందూరి సిద్దాగౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని అన్నారు.

జర్నలిస్టుల పై పెరుగుతున్న ఒత్తిడి ల అధిగమించేందుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ప్రాధాన్యత కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించబడతాయని అన్నా రు. నూతనంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ముద్ర కోలా నరసింహులు ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.జిల్లా ఉపాధ్యక్షులుగా డి కృష్ణారావు, ఆర్ రామ్మూర్తి, కే హరీష్, ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ గా అఖిల్ రెడ్డి, కోశాధికారిగా నీల వెంకటి, ముఖ్య సలహాదారులుగా ఎం సాయిలు, జె శ్రీనివాస్, ఎస్ మురళి, జి చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా అబ్రబోయిన శ్రీను, శ్రీకాంత్ గౌడ్, రాజు, ఆశన్న, వెంకటేష్ కుమార్, సుమారు 40 మంది అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!