కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య?
గొంతు కోసి హత్య చేసిన దుండగులు
కర్నూలు జిల్లా: ఆగస్టు19
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. పెద్దహరివాణంలో బీజేపీ నేత శేఖన్న (50)ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు.
ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను కొందరు దుండ గులు గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



