గద్దల్లా వాలిన నకిలీ విలేకరులు…

 

గద్దల్లా వాలిన నకిలీ విలేకరులు…

వెల్దుర్తి ఆగస్టు 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమావేశం నిర్వహించడం జరిగింది. నకిలీ విలేకరులు మాత్రం ప్రభుత్వ కార్యకలాపాలకు హాజరై హల్ చల్ చేస్తున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ నకిలీలు మాత్రం హాజరవుతూనే ఉంటారు. అధికారులకు మాయ మాటలు చెబుతూ.. పబ్బం గడుపుతున్నారు. ఇలాంటి నకిలీలు సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలని తయారవుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. నకిలీలకు కొందరు సపోర్టు చేయడంతోనే ఇలాంటివారు తయారవుతున్నారని పట్టణ ప్రజలు గుస గుస లాడుతున్నారు. నకిలీలకు పునాదులు వేస్తూ పోతే.. సమాజంలో ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!