గొలుగొండ
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని కసిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలకు గేదెల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంత ప్రజల కొరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, గొలగొండ మండల యూత్ అధ్యక్షులు వాసు వెంకటేష్, బోయిన చిరంజీవి, ఐటీడీపీ అల్లు నరేష్, కసిమి పంచాయతీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్