గొలుగొండ
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని కసిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలకు గేదెల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంత ప్రజల కొరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, గొలగొండ మండల యూత్ అధ్యక్షులు వాసు వెంకటేష్, బోయిన చిరంజీవి, ఐటీడీపీ అల్లు నరేష్, కసిమి పంచాయతీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.



