గొలుగొండ
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని కసిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలకు గేదెల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంత ప్రజల కొరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, గొలగొండ మండల యూత్ అధ్యక్షులు వాసు వెంకటేష్, బోయిన చిరంజీవి, ఐటీడీపీ అల్లు నరేష్, కసిమి పంచాయతీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



