గొలుగొండ
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని కసిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలకు గేదెల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంత ప్రజల కొరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, గొలగొండ మండల యూత్ అధ్యక్షులు వాసు వెంకటేష్, బోయిన చిరంజీవి, ఐటీడీపీ అల్లు నరేష్, కసిమి పంచాయతీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



