వరి పంట పొలాలని పరిశీలించిన తాసిల్దార్…
ఎస్ రాయవరం మండలం సెప్టెంబర్ 2 అఖండ భూమి మండలంలో రాయవరం
గ్రామం శివారులో వరి పొలాలను మండల తహసీల్దార్ విజయ కుమార్,మండల వ్యవసాయాధికారి సౌజన్య,ఏ ఈ ఇరిగేషన్ సందర్శించడం జరిగింది. రైతులకు కొన్ని సూచనలు చేయడమైనది నీట మునిగిన పొలాలు త్వరగా పుంజుకోవడానికి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా + 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. తరువాత లీటరు నీటికి 2 గ్రా.కార్బెండిజం+మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
పిలకలు కట్టే దశలో నీరు బయటకు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా + 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటు గా వేయడం వల్ల పంట త్వరగా పుంజుకుంటుంది మరియు నష్టంచాలావరకు తగ్గుతుంది.
ఈ వాతావరణం లో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1 గ్రా’కార్బెండిజం లేక 2 గ్రా. కార్బెండిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



