వరి పంట పొలాలని పరిశీలించిన తాసిల్దార్…
ఎస్ రాయవరం మండలం సెప్టెంబర్ 2 అఖండ భూమి మండలంలో రాయవరం
గ్రామం శివారులో వరి పొలాలను మండల తహసీల్దార్ విజయ కుమార్,మండల వ్యవసాయాధికారి సౌజన్య,ఏ ఈ ఇరిగేషన్ సందర్శించడం జరిగింది. రైతులకు కొన్ని సూచనలు చేయడమైనది నీట మునిగిన పొలాలు త్వరగా పుంజుకోవడానికి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా + 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. తరువాత లీటరు నీటికి 2 గ్రా.కార్బెండిజం+మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
పిలకలు కట్టే దశలో నీరు బయటకు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా + 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటు గా వేయడం వల్ల పంట త్వరగా పుంజుకుంటుంది మరియు నష్టంచాలావరకు తగ్గుతుంది.
ఈ వాతావరణం లో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1 గ్రా’కార్బెండిజం లేక 2 గ్రా. కార్బెండిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..