జూలై 23 రిపోర్టు వస్తే, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు?
జగన్ దిష్టిబొమ్మ అవగాహన లోపమే- ఎంపీపీ బడుగు రమేష్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 22
హిందువులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు లో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు కొత్త ఆలోచనలు తెరపైకి తెచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎంపీపీ బడుగు రమేష్ అన్నారు. జూలై 9న లడ్డు శాంపిల్స్ పరీక్షకు పంపి, 23న రిజల్ట్ వస్తే ఇంతవరకు నిజనిర్ధారణ కమిటీ వేయకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ఎంపీపీ ప్రశ్నించారు. 100 రోజుల్లో ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించడానికి లడ్డును తెరపైకి తెచ్చిందని అన్నారు. లడ్డును సాంప్రదాయబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారం తయారు చేస్తారని దానిలో బయట భక్తుల ప్రమేయం లేదని కూటమినేతలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. లడ్డులో అవినీతి జరిగితే టీటీడీ నుంచి రావాల్సిన ప్రెస్ నోట్, టిడిపి కార్యాలయం నుంచి రావడం ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లడ్డులో జరిగిన అవినీతిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేస్తూనే, దీనిపై అవగాహన లేని కొంతమంది కూటమి నేతలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము తలుచుకుంటే మండలంలోని గ్రామ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునియ్యగలమని ఎంపీపీ బడుగు రమేష్ హెచ్చరించారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



