మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్న స్నేహబంధం.

*మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్న స్నేహబంధం. తుగ్గలి సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్):-* తమలో చదివిన బాల్యమిత్రుడి కుటుంబం కష్టాల్లో ఉన్నదని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. తుగ్గలి జిల్లా పరిషత్ హై హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థి సుధాకర్ (38) కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధి తో బారినపడి అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న 2003 (పదవ తరగతి) బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించి తమ వంతు సహాయంగా సుమారు 60 వేల రూపాయలు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు సుధాకర్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!