కోతులు బాబోయ్ కోతులు. పంట పోలాలు నాశనం చేస్తున్నాయి
నష్టపోతున్నాం అంటున్న గిరిజన రైతాంగం
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 23
కోతులు బాబోయ్ కోతులు మనుషుల ప్రాణాలతోటే కాకుండా పంట చేలును కూడా నాశనం చేస్తూ తీవ్రంగా రైతాంగాన్ని నష్టపరుస్తున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో బట్ట పనుకుల పంచాయతీ పరిధిలో గల తీగల మెట్ట గ్రామములో ఉన్న పంట పొలాలపై ఇబ్బడి ముప్పడిగా కోతులు దాడులు చేస్తూ నాశనం చేస్తున్నాయన్నారు వేలాది రూపాయలు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టామని పంట చేతికి రాకముందే కోతుల రూపంలో నష్టపోవలసిన దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో కోతులు రావడంతో అవి ఎక్కడ తమపై దాడులు చేస్తాయో ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నామని దీంతో కోతులు తమ ప్రతాపం అంతా పంట పొలాలపై చూపిస్తూ తమకు నష్టం మిగులుతున్నాయని తెలిపారు ఫారెస్ట్ అధికారులు స్పందించి కోతులను నుండి ప్రజలను కాకుండా పంట పొలాలను కూడా కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు లేకుంటే తామంతా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు అంటున్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


