కోతులు బాబోయ్ కోతులు. పంట పోలాలు నాశనం చేస్తున్నాయి
నష్టపోతున్నాం అంటున్న గిరిజన రైతాంగం
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 23
కోతులు బాబోయ్ కోతులు మనుషుల ప్రాణాలతోటే కాకుండా పంట చేలును కూడా నాశనం చేస్తూ తీవ్రంగా రైతాంగాన్ని నష్టపరుస్తున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో బట్ట పనుకుల పంచాయతీ పరిధిలో గల తీగల మెట్ట గ్రామములో ఉన్న పంట పొలాలపై ఇబ్బడి ముప్పడిగా కోతులు దాడులు చేస్తూ నాశనం చేస్తున్నాయన్నారు వేలాది రూపాయలు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టామని పంట చేతికి రాకముందే కోతుల రూపంలో నష్టపోవలసిన దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో కోతులు రావడంతో అవి ఎక్కడ తమపై దాడులు చేస్తాయో ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నామని దీంతో కోతులు తమ ప్రతాపం అంతా పంట పొలాలపై చూపిస్తూ తమకు నష్టం మిగులుతున్నాయని తెలిపారు ఫారెస్ట్ అధికారులు స్పందించి కోతులను నుండి ప్రజలను కాకుండా పంట పొలాలను కూడా కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు లేకుంటే తామంతా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు అంటున్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


