పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు
గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి

టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు (నాని బాబు)
గొలుగొండ అనకాపల్లి జిల్లా
అక్టోబర్ 15 (అఖండ భూమి) అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మండలంలో సిహెచ్ నాగపురం చిడిగుమ్మల గొలుగొండ అమ్మపేట పంచాయితీల్లో వివిధ సిసి రోడ్లకు కూటమి నాయకులు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు (నాని బాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు అయినప్పటికీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు గొలుగొండ మండలంలో వివిధ పంచాయతీలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 11 కోట్ల రూపాయలు తో వివిధ అభివృద్ధి పనులకు పంపించడం జరిగిందని వెంటనే నిధులు మంజూరయ్య అని ఆయన తెలిపారు సిసి రోడ్లు వంటి నిర్మాణాలు చేపట్టమన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో కూటమి నాయకులు అన్నిచోట్ల విధిగా పాల్గొని చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు చిటికెల సాంబ మూర్తి బిజెపి సీనియర్ నాయకులు గాదె శ్రీనివాసరావు. జోగుంపేట మాజీ సర్పంచ్ సుర్ల సీతారామమూర్తి (బాబ్జి) గొలుగొండ సర్పంచ్ కసిపెల్లి అప్పారావు ఎంపీటీసీ చేపల చినపాప తో పాటు కార్యకర్తలు పలు శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


